
80 ప్యాకెట్ల బియ్యంతో పాటు ఓ బొలెరో వాహనం సీజ్….. ఇద్దరు వ్యక్తుల అరెస్టు..
గుంతకల్లులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ను పలువురు అక్రమంగా ఇతర ప్రాంతాలకుతరలిస్తున్న వైనం లో అధికారుల అలసత్వం బహిర్గతంగా కావడం హేయం. గురువారం అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో గుంటకల్ పట్టణంలోని టీవీ స్టేషన్ దగ్గర కూడలి వద్ద టూ టౌన్ పోలీసు వారు వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో బొలెరో వాహనంలో దాదాపు 3600 కేజీలు గల 80 బస్తాలు రేషన్ బియ్యం గుత్తి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న గుత్తి ప్రాంతానికి చెందిన నాగ శేషు , హరి ప్రసాద్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సదరు సంఘటనపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి పట్టుబడిన బియ్యం ను అప్పగించారు.