Wednesday, July 30, 2025
spot_img

కళ్యాణదుర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం…

కళ్యాణదుర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం…

— డివిజన్ కు సంబంధించి కళ్యాణదుర్గం ఆర్.డి.టి ఎకాలజీ సెంటర్ లో పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ…

-కళ్యాణదుర్గం డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, నవంబర్ 24 :

సోమవారం 25వ తేదీన కళ్యాణదుర్గంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. కళ్యాణదుర్గం డివిజన్ కు సంబంధించి కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్.డి.టి ఎకాలజీ సెంటర్ లో ఈనెల 25వ తేదీన సోమవారం ఉదయం 9 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కళ్యాణదుర్గం డివిజన్ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.
అలాగే అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వితీయ స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular