
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారత పౌరుని బాధ్యత
నవంబర్ 26 : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామం నందు నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు టౌన్ కార్యదర్శి శ్రీనివాసులు, కెవిపిఎస్ డివిజన్ అధ్యక్షులు జగ్గిల రమేష్, సంచారజాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసులు, రాయలసీమ దళిత సంఘం అధ్యక్షులు తగరం రామాంజనేయులు, గ్రామీణ పౌర సేవ సమితి నాయకులు అధ్యక్షులు లాల్ రెడ్డి, అనిల్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామి దాస్ మాదిగ, పౌర హక్కుల సంఘం గుంతకల్ ఇన్చార్జి వి ఆదినారాయణ, ఎంఆర్పిఎస్ మండల నాయకులు జయరాం మాదిగ, పక్కిరప్ప మాదిగ, రమేష్ మాదిగ, వెంకట రాముడు మాదిగ, పుల్లన్న మాదిగ, రజక సంఘం నాయకులు హనుమంతు, ఆంజనేయులు, ప్రజాస్వామ్యవాదులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, భారత దేశానికి దశ దిశ నిర్దేశించిన మార్గదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రచించి భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, రచన కాలం రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందన్నారు. భారతీయులందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా కసాపురం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామిదాస్ మాదిగ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం నాయకులు గుంతకల్ టౌన్ కార్యదర్శి సంచి శ్రీనివాసులు, డివిజన్ కార్యదర్శి కెవిపిఎస్ నాయకులు జగ్గిల్ రమేష్, పౌరహక్కుల సంఘం గుంతకల్ ఇన్చార్జి వి ఆదినారాయణ, గ్రామీణ సేవా సమితి అధ్యక్షులు లాల్ రెడ్డి, అనిల్, ఎంఆర్పిఎస్ గుంతకల్ మండల నాయకులు జయరాం మాదిగ, పకీరప్ప మాదిగ, గ్రామీణ కార్యకర్తలు వెంకట రాముడు మాదిగ, రమేష్ మాదిగ, కాశీనాథ్ మాదిగ, రజక సంఘం నాయకులు హనుమంతు, ఆంజనేయులు, పుల్లన్న, రామాంజనేయులు, మల్లప్ప, వెంకటేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.