
*మూడో విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… గుమ్మనూరు జయరాం
నవంబర్ 26 :గుంతకల్లు
గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి ,గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి ఇంచార్జ్ గుమ్మనూర్ ఈశ్వర్ , గుమ్మనూరు నారాయణ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మూడో విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గుంతకల్లు నియోజకవర్గం మూడు మండలాల లబ్ధిదారులకు అందించడం జరిగింది.ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ అనారోగ్యం రీత్యా ఎంతోమంది తమ సొంత నిధులతో ఖర్చు పెట్టుకుని హాస్పిటల్లో చూపించుకుని తర్వాత తమ దగ్గరికి వచ్చి తమ సమస్యను తనతో చెప్పారని ఈ సమస్య ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి కి సమస్యను వివరించడం జరిగిందని స్పందించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గుంతకల్లు నియోజకవర్గం కు నాలుగు లక్షల 85 వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది అని తెలిపారు తాను ఎల్లవేళలా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలాఅండగా ఉంటానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.