
ఈ నెల 29వ తేదీ నుండి మూడు,ఐదు సెమిష్టర్ పరీక్షలు ప్రారంభం
ఎన్.టి.కె.నాయక్,వర్సిటీ వైస్ఛాన్సులర్ ఆచార్య
కర్నూలు ఎడ్యుకేషన్ : నవంబర్ 29
రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో మూడు,ఐదు వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభమైనట్లు వర్సిటీ వైస్ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె.నాయక్ పరిశీలించారు.మేరకు శుక్రవారం ఈ పరీక్షలకుగాను కర్నూలు, నంద్యాల జిల్లాలో మొత్తం 61పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారంలేకుండా పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండ్లకు ఆయన సూచించారు.పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నేడు నగరంలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి,ఎస్ టిబిసి కాలేజీల్లో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆయన వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. పరీక్షలు జరుగుతన్న విధానంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.