
ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రఖ్యాత విద్యాసంస్థ…
అమరావతి.
ఏపీలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) తన క్యాంపస్ ను రాజధాని అమరావతి లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అన్ని హంగులతో అమరావతిలో ప్రాంగణాన్ని
నిర్మించనున్నట్లు తెలిసింది. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది.50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. బిట్స్ క్యాంపస్ రాకతో రాజధాని ప్రాంతం విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.