
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భార్గవ సాయి నియామకం
బి వి ఆర్ టుడే న్యూస్ డిసెంబర్ 10 రాజమండ్రి : కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన భార్గవసాయికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా లో వస్తాను లభించింది.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలో మంగళవారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, నేషనల్ చైర్మన్ చెన్నూపాటి శ్రీకాంత్ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు గార్ల ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భార్గవ సాయి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు సభ్యులు భార్గవ్ సాయిని అభినందించారు. మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.