Wednesday, April 23, 2025
spot_img

పొగాకు ప్రాణాంతకం…ధూమపానం అనారోగ్యం…

పొగాకు ప్రాణాంతకం…
ధూమపానం అనారోగ్యం…

డిసెంబర్ 10,గుంతకల్లు బి.వి.ఆర్ టుడే న్యూస్.
పొగాకుతో తయారు చేయబడిన బీడీలు, సిగరెట్లు తదితర ఉత్పత్తులు ప్రాణాంతకరమని, ప్రధానంగా నేటి యువకులు విలాసాల ప్రతిభగా వాటిని సేవిస్తున్న తీరు అనారోగ్యానికి హేతువు అన్న సత్యాన్ని గుర్తించాలని పలువురు వక్తలు సూచించారు. మంగళవారం
జాతీయ పొగాకు నియంత్రణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి Dr. G. నారాయణస్వామి ఆధ్వర్యంలో కసాపురం సబ్ సెంటర్ నందు , CHOs, కు, అంగన్వాడీ టీచర్స్ ANMs , Ashas మరియు ప్రజలకు, COTPA Act-2003 సిగరెట్టు మరియు ఇతర పొగాకు సంబంధింత ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా Dr. G. నారాయణస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సకాలంలో పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కానీ ప్రాణాంతకమైన పొగాకు ఉత్పత్తులను కాదన్నారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, పొగాకు వాటి ఉత్పత్తుల వాడకంకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ పొగాకు ఉత్పత్తుల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని, మనిషి యొక్క ఆయుష్యు తగ్గుతుందని, పొగాకు ఏ రూపంలో వాడినా అది మానవాళి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల పరిధిలో ఉన్న పలు దుకాణాలలో సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదన్న ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వలన ఎనిమిది లక్షల మంది మిలియన్ ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మంది చనిపోతున్నారని అందులో ఒక్క మిలియన్ ప్రజలు సిగరెట్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారన్నారు . సిగరెట్ వాడడంతో అందులో ఉన్న నాలుగు వేల రకాల రసాయనాలు మనిషి యొక్క అవయవాలపై ప్రభావం చూపించి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా నోరు, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలుమెండుగా ఉన్నాయన్నారు. ఈక్రమంలోనే బహిరంగ ధూమపానము చేసిన, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాల లోపు ఎవరైనా దుకాణాలలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా రూ:200 కూడా విధించడం జరుగుతుంది. పొగాకు ఉత్పత్తులపై
ఎలాంటి ప్రచారం నిర్వహించ రాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగకు నియంత్రణ Social Worker /DCM, B. శ్రీరాములు, NCD ఫ్లోరోసిస్, కన్సల్టెంట్ ఆంజనేయలు, కిషోర్, CHO, Ashas, Anms, అంగన్వాడీ టీచర్స్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular