
మానవ హక్కుల సమితి రాయలసీమ జిల్లాల అధ్యక్షునిగా గుమ్మనూరు నాగార్జున…
బివిఆర్ టుడే న్యూస్.
డిసెంబర్ 17 గుంతకల్లు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం, జాతీయ మానవ హక్కుల సమితి, రాయలసీమ జిల్లాల జోనల్ అధ్యక్షునిగా గుమ్మనూరు నాగార్జున ని నియమిచ్చినట్లు జాతీయ మానవ హక్కుల సమితి చైర్మన్,తూము రామచంద్ర నాయుడు, జాతీయ మానవ హక్కుల సమితి, వైస్ చైర్మన్, మరియు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.ఎస్ కృష్ణారెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా ఎన్నికైన గుమ్మనూరు నాగార్జున మాట్లాడుతూ, ఇంతకుముందు జాతీయ మానవ హక్కుల సమితి, అనంతపురం సత్య జిల్లాల కన్వీనర్ గా ఉన్న నన్ను, గుర్తించి, నాపై నమ్మకం ఉంచి నాకీ ఉన్నత పదవి ఇచ్చినందుకు, చైర్మన్ తూము రామచంద్ర నాయుడు, వైస్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ బి ఎస్ కృష్ణారెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాపై నమ్మకం ఉంచి నాకిచ్చిన పదవికి, పూర్తిగా న్యాయం చేస్తానని, మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, సమస్త కు ఎటువంటి అపకీర్తి తీసుకురాకుండా, నీతి నిజాయితీగా పనిచేస్తానని, మానవ హక్కుల పరిరక్షణ సమితి, సభ్యులంతా ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తారని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, పనిచేస్తానని గుమ్మనూరు నాగార్జున తెలియజేశారు.