Thursday, April 24, 2025
spot_img
Home Blog Page 5

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు…

0

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు….

నవంబర్ 30 శ్రీకాళహస్తి

పవిత్ర మాసములలో ఒకటైన ఈశ్వరునకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రతీతి. కార్తీకమాసం శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలను దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో సాంప్రదాయ రీతిన జరిగాయి. సదరు పూజ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆలయ వేద పండితులు, అర్చక బృందం సంయుక్తంగా దేవాలయ ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశములు ఏర్పాటుతో విశేష పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు శ్రీవారికి ధూప,దీప నైవేద్యాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని కార్తీక మాసపు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమ బిల్వాలను కుంకుమను నిమజ్జల కార్యక్రమంను అత్యంత భక్తిశ్రద్ధల నడుమ సాంప్రదాయ పద్ధతిలో భక్తాదుల పట్ల నేత్రానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి
టి.బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కర్ణాకర్ గురుకుల్, ఏ.ఈ.ఓ లోకేష్ రెడ్డి,సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్, దేవస్థానం ఇన్స్పెక్టర్ హరి యాదవ్, మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు…

0

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో నేత్రానందకరంగా కార్తీక మాసోత్సవ విశేష పూజా కార్యక్రమాలు….

నవంబర్ 30 శ్రీకాళహస్తి

పవిత్ర మాసములలో ఒకటైన ఈశ్వరునకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రతీతి. కార్తీకమాసం శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలను దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో సాంప్రదాయ రీతిన జరిగాయి. సదరు పూజ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆలయ వేద పండితులు, అర్చక బృందం సంయుక్తంగా దేవాలయ ధ్వజస్తంభం ఎదురుగా 108 అష్టోత్తర కలశములు ఏర్పాటుతో విశేష పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలతో పాటు శ్రీవారికి ధూప,దీప నైవేద్యాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని కార్తీక మాసపు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన పూజా కార్యక్రమ బిల్వాలను కుంకుమను నిమజ్జల కార్యక్రమంను అత్యంత భక్తిశ్రద్ధల నడుమ సాంప్రదాయ పద్ధతిలో భక్తాదుల పట్ల నేత్రానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి
టి.బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి,దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్,కర్ణాకర్ గురుకుల్, ఏ.ఈ.ఓ లోకేష్ రెడ్డి,సి.ఎస్.ఓ నాగభూషణం యాదవ్, దేవస్థానం ఇన్స్పెక్టర్ హరి యాదవ్, మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు (ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు) ఏర్పాటు..

0

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు (ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు) ఏర్పాటు..
నవంబర్ 30 :అమరావతి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గానూ 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు.

ఈ 88 పీహెచ్సీలకు గానూ కర్నూల్ -9,పల్నాడు -7, తూర్పు గోదావరి, నెల్లూరు – 6 చొప్పున, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు 5 చొప్పున, కాకినాడ, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఏలూరు నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్య సాయి జిల్లాలకు 4 చొప్పున, విజయనగరం, కడప, ఎన్టీఆర్ జిల్లాలకు 2 చొప్పున, అల్లూరి విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అన్నమయ్య జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున పీహెచ్సీలు మంజూరు అయినట్లు తెలిపారు.

పీహెచ్సీల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని,45 మంది వైద్యులకు 42 మంది వైద్యులను నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక…

0

రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక…

Nov 30, 2024,
స్టేట్ ఇన్చార్జ్ అమరావతి

రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వారికి సీఎం స్పష్టం చేశారు. వినతులుపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని అధికారులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

శ్రీ నగేరేశ్వరులకు వైదికంగా అన్నాభిషేకం విశేష పూజలు…

0

శ్రీ నగేరేశ్వరులకు వైదికంగా అన్నాభిషేకం విశేష పూజలు…
నవంబర్ 29: గుంటకల్లు
గుంతకల్లు పట్టణంలోని ప్రముఖ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో శుక్రవారం ఉప ఆలయమైన శ్రీ నగేరేశ్వర స్వామివారికి అన్నాభిషేకం తో విశేష పూజలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం శ్రీవారి మూలవరులకు విశేష పూజలతో వైదికంగా అన్నాభిషేకం నిర్వహించారు. సదర కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యన పాల్గొన్నారు.

శ్రీ నెట్టికంటుని హనుమద్ వ్రత పూజకు ఓ ధాత వెండి వస్తువుల దాతృత్వం…

0

శ్రీ నెట్టికంటుని హనుమద్ వ్రత పూజకు ఓ ధాత వెండి వస్తువుల దాతృత్వం…

నవంబర్ 29:గుంతకల్లు

పవిత్ర పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకు ఓ ధాత కుటుంబం దాతృత్వంను చాటుకున్నారు. శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి ఓంకారం వెంకటేశ్వరుడు తెలిపిన వివరాల మేరకు… శ్రీ నెట్టికంటుని సన్నిధిలో జరుపబోవు శ్రీ హనుమద్ వ్రతము కార్యక్రమ పూజలకు గాను కసాపురం గ్రామ వాస్తవ్యులైన జి రమాదేవి అనే భక్తురాలు దాతృత్వంగా 002-165-000 గ్రాముల రజతం (వెండి) వస్తువులుగా ఓ ప్లేటు, ఓ శటారి, రెండు తీర్థం గిన్నెలు, ఐదు చిన్న పంచ పాత్రలుతో పాటు రెండు ఉద్దరినిల వస్తువులను ఓ ధాతగా తమ కార్యాలయంకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు పి. వెంకటేశులు పాల్గొన్నారు.ఈ క్రమంలో ధాతలకు శ్రీస్వామి వారి మూలవరుల దర్శనార్థంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆలయ సాంప్రదాయానుసారంగా శ్రీవారి జ్ఞాపకార్థంగా శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదములను అందజేశామన్నారు.

తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా సత్తెనపల్లి వాసి…

0

తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా సత్తెనపల్లి వాసి…
— ఓ కోర్టులో తల్లి జూనియర్ అసిస్టెంట్.. తనయ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక….


నవంబర్ 29, సత్తెనపల్లి

ఓ కుటుంబంలో తల్లి ప్రధాన జూనియర్ జడ్జి( సివిల్ డివిజన్ ) కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ విధులను నిర్వహిస్తూన్న తీరులో నేడు సివిల్ జడ్జిగా తనయ ఎంపిక కావడం హర్షనీయం. వివరాల మేరకు…సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్.కరిముల్లా, సుజాత గార్ల ఏకైక కుమార్తె షేక్ రోషన్ 2024 లో విడుదల అయిన జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకోవడం, వివిధ దశల్లో జరిగిన పోరాట ఫలితాలలో సఫలీకృతం కావడం అభినందనీయం. ఆమె తండ్రి ఓ ప్రైవేటు ఉద్యోగిగాను,తల్లి సత్తెనపల్లి ప్రధాన జూనియర్ జడ్జి (సివిల్ డివిజన్) కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు విశేషం.
షేక్ రోషన్ విద్య సాగించిన తీరులో భాగంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నెల్లూరు లోను, 6 నుంచి 10 వరకు సత్తెనపల్లి ప్రగతి విద్యాసంస్థల్లో, ఇంటర్ గుంటూరులో,అనంతరం క్లాట్ లో ర్యాంక్ సాధించటంతో విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో 5 సంవత్సరాల వరకు ‘లా’ విద్యను 2023 లో పూర్తి చేశారు. వెంటనే ఏ.పి బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వెను వెంటనే 2024 లో జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ విడుదల అవ్వటం,తొలినుండే అన్నింటా ప్రథమ ర్యాంక్ సాధించడం ఆమె కృషికి నేడు ఫలితం.తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా తనయ ఎంపిక అవ్వటంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్థానికంగా పలువురు న్యాయవాదులు వారిని అభినందించారు.

సీఎం చేతుల మీదుగా నేమకల్లులో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ…

0

సీఎం చేతుల మీదుగా నేమకల్లులో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ…
— గ్రామ ప్రజలతో సమావేశం.. అర్జీల స్వీకరణ…


నవంబర్ 29 అనంతపురం:

రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈనెల 30వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది. శనివారం ఆయన ఒకరోజు పర్యటనలో భాగంగా బొమ్మనహాల్‌ మండలం నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు. కూటమి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తరువాత స్వయంగా ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు. రచ్చబండ తరహాలో నేమకల్లు గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి సమావేశమౌతారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌..

3.45 గంటలకు హెలిక్యాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు.

శనివారం ఉదయం 11 గంటలకు: తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రాయానికి బయలుదేరుతారు.

11.40: విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు బెంగళూరు విమానాశ్రాయానికి చేరుకుంటారు.

12.45: బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

12.45 గంటల నుంచి 12.50 గంటల వరకూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

12.50 గంటల నుంచి 1.20 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు.

1.20 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.25 గంటలకు నేమకల్లు ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు.

1.25 గంటల నుంచి 1.55 గంటల వరకూ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.

1.55 గంటల నుంచి 2.00 గంటల వరకూ నేమకల్లులోని ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత 3.05 గంటల వరకూ స్థానిక ప్రజలతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం 3.10 గంటలకు నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకొని 3.15 గంటల వరకూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

సైబర్ నేరాల నియంత్రణకు డయల్ 1930 నంబర్ పై ప్రజలకు అవగాహన.. జిల్లా ఎస్పీ బిందు మాధవ్.

0

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే చాలా ముఖ్యం

సైబర్ నేరాల నియంత్రణకు డయల్ 1930 నంబర్ పై ప్రజలకు అవగాహన

కరపత్రాలతో ప్రజలకు అవగాహన చేస్తున్న పోలీసులు

సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో సైబర్ నేరాల నియంత్రణకు కర్నూలు పోలీసుల చర్యలు

కర్నూలు క్రైం : నవంబర్ 29

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే చాలా ముఖ్యమని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ జిల్లా ప్రజలకు శుక్రవారం తెలిపారు.సైబర్ నేరాల పై ఏర్పాటు చేసిన డయల్ 1930నంబర్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీసుస్టేషన్ పరిధులలో పోలీసు అధికారులు, సిబ్బంది సైబర్ నేరాల నియంత్రణకు,కట్టడికి సైబర్ నేరాల అవగాహన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.ప్రజలు వాటిని చూసి చదువుకునేందుకు వీలుగా ముద్రించారు. ఆయా డిగ్రీ కళాశాలలు , యూనివర్సిటీలలో,రద్దీ ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలలో,గ్రామ సచివాలయాలలో,రైల్వేస్టేషన్ లలో బస్టాండ్ లలో జనం రద్దీగా ఉండే చోట్ల ప్రజలకు పంచుతున్నారు.ఒక్క రోజే దాదాపు ఎనిమిదివేల మందికి సైబర్ నేరాల అవగాహన కరపత్రాలను జిల్లా పోలీసులు పంచి,ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నేటి నుండి నిరంతరం కొనసాగుతుందన్నారు.సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టవచ్చో కూడా ప్రజలకు వివరిస్తున్నారు.ఎట్టి పరిస్ధితుల్లోనూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఒపెన్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరికి వాటి పట్ల అవగాహన అవసరమని పోలీసులు చెబుతున్నారు.సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల చాలా మందికి అవగాహన లేకపోవడంతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అప్రమత్తo చేస్తున్నారు.
ఆన్ లైన్ లావా దేవీలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని,సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తత ముఖ్యం అని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 29వ తేదీ నుండి మూడు,ఐదు సెమిష్టర్ పరీక్షలు ప్రారంభం…ఎన్.టి.కె.నాయక్,

0

ఈ నెల 29వ తేదీ నుండి మూడు,ఐదు సెమిష్టర్ పరీక్షలు ప్రారంభం

ఎన్.టి.కె.నాయక్,వర్సిటీ వైస్ఛాన్సులర్ ఆచార్య

కర్నూలు ఎడ్యుకేషన్ : నవంబర్ 29

రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో మూడు,ఐదు వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభమైనట్లు వర్సిటీ వైస్ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె.నాయక్ పరిశీలించారు.మేరకు శుక్రవారం ఈ పరీక్షలకుగాను కర్నూలు, నంద్యాల జిల్లాలో మొత్తం 61పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారంలేకుండా పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండ్లకు ఆయన సూచించారు.పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నేడు నగరంలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కాలేజి,ఎస్ టిబిసి కాలేజీల్లో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆయన వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. పరీక్షలు జరుగుతన్న విధానంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.