Monday, May 12, 2025
spot_img
Home Blog Page 13

శాశ్వత నిత్యాన్నదానం కు ఓ దాత లక్ష రూపాయలు విరాళం.

0

శాశ్వత నిత్య అన్నదానంకు లక్ష రూపాయలు ఓ దాత దాతృత్వం…
నవంబర్ 15 :గుంతకల్లు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం నకు దాత శాశ్వత నిత్య అన్నదానమునకు లక్ష రూపాయలు విరాళంగా తన దాతృత్వంను చాటుకున్నారు.
శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో తాడిపత్రి మండలం కొండేపల్లి గ్రామానికి చెందిన జి శ్రీనివాసరావు అనే ఓ ధాత తన దాతృత్వంగా శాశ్వత నిత్యాన్న దానము నకు గాను లక్ష రూపాయలను ఆలయ సిబ్బందికి నగదును అందజేశారు. ఇదిలా ఉండగా దేవస్థానం కార్యాలయంలో ప్రధాన ముఖ్య అధికారులు గైర్హాజరుతో తాము సిబ్బందికి లక్ష రూపాయల నగదును అందించి తగు రసీదును పొందిన వైనంగా స్థానికంగా ప్రచారం ఉండడం గమనార్హం.

అపార్ ఐడి కార్డ్స్ జనరేషన్ పై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష..

0

అపార్ ఐడి కార్డ్స్ పై కలెక్టర్ సమీక్ష ..
నవంబర్ 14: అనంతపురం

జిల్లాలోని డిపిఓ ,మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు,DLDO లు మండల విద్యాశాఖ అధికారుల తో అపార్ ఐడి కార్డ్స్ జనరేషన్ పైన గౌరవ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది
ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి యొక్క ఇబ్బందులను కేస్ వైస్ తయారు చేసుకుని వాటి పరిష్కారం కొరకు జిల్లా కార్యాలయానికి పంపవలెనని ఆదేశించారు. ప్రతి మండల విద్యా కేంద్రం మరియు ఉన్నత పాఠశాలలు ఈ ప్రక్రియ పూర్తి చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్లను అందుబాటులో ఉంచవలసినదిగా మున్సిపల్ కమిషనర్లను ఎంపీడీవోలను ఆదేశించడం జరిగినది గతంలో ఆదేశించినట్లుగా ప్రతి ఉన్నత పాఠశాలలో మూడు టీములను ఏర్పాటు చేశారా లేదా అనే విషయం పైన రాయదుర్గం మండల విద్యాశాఖ అధికారిని ప్రశ్నించడం జరిగినది, దీని ద్వారా జిల్లా అంతట ప్రతి ఉన్నత పాఠశాలలో మూడు టీములను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించడమైనది అపార్ ఐడిని జనరేట్ చేసే క్రమంలో సర్వర్ సమస్యలల్ గురించి ప్రస్తావించి వాటి విషయమై గుత్తి మండల విద్యాశాఖ అధికారులు సమీక్షల్ చేయడం జరిగింది, ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులచే అపార్ ఐడి కార్డు విషయమై సమావేశమును ఏర్పాటు చేసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నం చేయవలసినదిగా గతంలో ఆదేశించిన విషయమై సమీక్ష చేయడం జరిగినది, ఉరవకొండ మండల విద్యాశాఖ అధికారిని ఈ విషయమై ప్రశ్నించగా ఆ అధికారి తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రులు ప్రస్తావించినటువంటి సమస్యలను తెలియజేయడమైనది
లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ను పొందుటకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ను వీలైనంత త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా డిపిఓ ను ఆదేశించారు.గతంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ కు సంబంధించిన ఉప విద్యాశాఖ అధికారి దగ్గర భద్రపరిచిన ల్యాప్టాప్ లను ఈ అపార్ ఐడి జనరేషన్ ప్రక్రియలో ఉపయోగించుకొనుటకు వాటిని ఒకసారి తనిఖీ చేయవలసిందిగా ఆదేశించారు . ఆధార్ సెంటర్లలో తల్లిదండ్రులు గందరగోళానికి గురి కాకుండా ఈ ప్రక్రియ మొత్తం అర్థమయ్యే విధంగా వెంటనే పోస్టర్లను తయారు చేసి పంపిణీ చేయవలసినదిగా రమణారెడ్డి ని ఆదేశించారు .జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ మరియు ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో వాట్స్అప్ గ్రూప్ ను క్రియేట్ చేయమని సూచించారు. ప్రతి మండలంలో ఉన్న పాఠశాలలన్నీ కూడా సమంగా MEO I & MEO II లు అనునిత్యం సందర్శించి ఈ ప్రక్రియను వేగవంతం చేయవలసినదిగా ఆదేశించారు.
.ఆధార్ కార్డు నందు ఉన్నటువంటి సవరణలకు సంబంధించి గుంతకల్ డి ఎల్ డి వో , అనంతపురం డి ఎల్ డి ఓ లతో వివరణ తీసుకున్నారు.
జిల్లాలోని ఆధార్ సెంటర్లలో ఉన్నటువంటి సమస్యల గురించి మండల విద్యాశాఖ అధికారు లు నార్పల D.HIREHAL మరియు ఆత్మకూర్ వారితో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు , జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆధార్ సెంటర్ల వివరములు మరియు వాటిలో ఉన్న సమస్యల గురించి DPO మరియు ఆధార్ నోడల్ ఆఫీసర్లను ఒక చెక్లిస్ట్ ను ప్రజెంట్ చేయవలసిందన్నారు. ఈ జూమ్ మీటింగ్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారు, APC నాగరాజు , DVEO వెంకటరమణ నాయక్ , APO నాగరాజు , ఆధార్ నోడల్ ఆఫీసర్ నారపరెడ్డి , బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగినది.

ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

0

ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, నవంబర్ 14:

జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు.
గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పథకాలపై డ్వామా పిడి, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఎంలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..        జల్ సంచయ్ – జన్ భగీ దారి  ఫోటో అప్లోడ్ త్వరితగతిన  పూర్తిచేయాలని  అన్నారు.జల్ సంచయ్ – జన్ భగీ దారి కార్యక్రమం   నందు గుంతకల్లు మండలం చాలా వెనుకబడి ఉందని  పురోగతి సాధించాలని  చెప్పారు. తదుపరి జరగబోయే  మీటింగ్ నందు నోడల్ అధికారులు తప్పక హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి ప్లాంటేషన్ వర్క్ 100% పూర్తి చేయాలని, పల్లె వనాలు  పథకానికి  సంబంధించి త్వరితగతిన   అనుమతులు పొంది  పనులను చేపట్టాలని,  అనుమతులు పొందిన రాయదుర్గం వారు సోమవారం పనులు ప్రారంభించాలని ఆదేశించారు.ఫారం పాంట్స్  ప్రతివారం  జిల్లా మొత్తం 300 మొదలుపెట్టాలని  అందులో  రాప్తాడు నందు చాలా తక్కువగా ఉన్నదని గుర్తించామన్నారు.  మండలాలలో పనులను గుర్తించి మండల రెజల్యూషన్  పూర్తి చేసి  మండలంలో  కనీసం 10  పనులను ప్రారంభించే విధంగా చూడాలని అన్నారు.అలా చేస్తేనే వందరోజుల ప్రణాళికలను  పూర్తి చేయడానికి వీలవుతుందని  తెలిపారు.  రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ఏడు రోజుల లోపల అనుమతులు తీసుకొని  పనులను వేగవంతం చేయాలని  అన్నారు.కమ్యూనిటీ సోప్ పిట్స్ 286 శాంక్షన్ అయ్యాయని దీనిలో కుందుర్పి మండలం నందు చాలా పెండింగ్ ఉన్నాయని జిల్లాలో వారానికి కనీసం 50 పనులు ప్రారంభిస్తే లక్ష్యాలను చేరుకునే ప్రణాళికలను తయారు చేసుకుని ముందుకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఈ పనుల నందు ఆలస్యం వహిస్తే కఠిన చర్యలు పేర్కొన్నారు. ఇండివిడ్యువల్ కమ్యూనిటీ సోప్ పిట్స్ సింగనమల వెనుకబడి ఉందని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈనెల 18 తరువాత అనుమతులు మంజూరు ప్రారంభిస్తే రోజుకు 2500 పూర్తి చేయు విధంగా చేస్తేనే ప్రభుత్వం చెప్పినట్లు నవంబర్ చివరి నాటికి లక్ష్యాలను చేరుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏపీఎంలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

0

ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, నవంబర్ 14:

జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు.
గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పథకాలపై డ్వామా పిడి, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఎంలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..        జల్ సంచయ్ – జన్ భగీ దారి  ఫోటో అప్లోడ్ త్వరితగతిన  పూర్తిచేయాలని  అన్నారు.జల్ సంచయ్ – జన్ భగీ దారి కార్యక్రమం   నందు గుంతకల్లు మండలం చాలా వెనుకబడి ఉందని  పురోగతి సాధించాలని  చెప్పారు. తదుపరి జరగబోయే  మీటింగ్ నందు నోడల్ అధికారులు తప్పక హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. నిర్దేశించిన సమయానికి ప్లాంటేషన్ వర్క్ 100% పూర్తి చేయాలని, పల్లె వనాలు  పథకానికి  సంబంధించి త్వరితగతిన   అనుమతులు పొంది  పనులను చేపట్టాలని,  అనుమతులు పొందిన రాయదుర్గం వారు సోమవారం పనులు ప్రారంభించాలని ఆదేశించారు.ఫారం పాంట్స్  ప్రతివారం  జిల్లా మొత్తం 300 మొదలుపెట్టాలని  అందులో  రాప్తాడు నందు చాలా తక్కువగా ఉన్నదని గుర్తించామన్నారు.  మండలాలలో పనులను గుర్తించి మండల రెజల్యూషన్  పూర్తి చేసి  మండలంలో  కనీసం 10  పనులను ప్రారంభించే విధంగా చూడాలని అన్నారు.అలా చేస్తేనే వందరోజుల ప్రణాళికలను  పూర్తి చేయడానికి వీలవుతుందని  తెలిపారు.  రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ఏడు రోజుల లోపల అనుమతులు తీసుకొని  పనులను వేగవంతం చేయాలని  అన్నారు.కమ్యూనిటీ సోప్ పిట్స్ 286 శాంక్షన్ అయ్యాయని దీనిలో కుందుర్పి మండలం నందు చాలా పెండింగ్ ఉన్నాయని జిల్లాలో వారానికి కనీసం 50 పనులు ప్రారంభిస్తే లక్ష్యాలను చేరుకునే ప్రణాళికలను తయారు చేసుకుని ముందుకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఈ పనుల నందు ఆలస్యం వహిస్తే కఠిన చర్యలు పేర్కొన్నారు. ఇండివిడ్యువల్ కమ్యూనిటీ సోప్ పిట్స్ సింగనమల వెనుకబడి ఉందని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈనెల 18 తరువాత అనుమతులు మంజూరు ప్రారంభిస్తే రోజుకు 2500 పూర్తి చేయు విధంగా చేస్తేనే ప్రభుత్వం చెప్పినట్లు నవంబర్ చివరి నాటికి లక్ష్యాలను చేరుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏపీఎంలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలకపాత్ర .. జిల్లా ఎస్పీ దంపతులు.

0

నవంబర్14: అనంతపురం

పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర

  • జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS దంపతులు వెల్లడి
  • జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా బాలల దినోత్సవం

పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS దంపతులు అభిప్రాయాన్ని వెల్లడించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులోరక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల నడుమ ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ గారితో పాటు ఆయన సతీమణి శ్రీమతి హేమ జగదీష్ IPS గారు పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఎస్పీ దంపతులు మాట్లాడాతు చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల భవిష్యత్తు నిర్ధేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమన్నారు కుటుంబ అభివృద్ధి, శ్రేయస్సు, భద్రత చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఉంది. రాబోవు విద్యాసంవత్సరంలో ఫస్ట్ క్లాస్ పోలీసు పిల్లలు ఉన్నారు చదువుకునేలా అనుమతుల కోసం దరఖాస్తు చేశాము. అంతేకాకుండా… స్పానిష్ టీచర్ కోసం కూడా ఆర్డీటీ వారికి లెటర్ పెట్టాము. పిల్లలకు చదువుతో పాటు ఆటలు, డ్యాన్స్ , ఇతర అభివృద్ధికి కృషి చేస్తామని పిలుపునిచ్చారు. అనంతరం ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలకు బిస్కెట్స్, పెన్నులు, తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా పిల్లలు పాటలు, నృత్యాలు, వేమన పద్యాలులో తమ తమ ప్రతిభను చాటారు. అలాగే ఓ మెజీషియన్ ఇచ్చిన ప్రదర్శన పిల్లల్ని సంతోషపరిచింది.
ఆకట్టుకున్న రోడ్డు భద్రతా నియమాల పాటింపుపై ప్రదర్శన…
రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలు బృందంగా ఏర్పడి రోడ్డు ప్రమాదాల నియంత్రణ… రోడ్డు భద్రతా నియమాల పాటింపుపై చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. వాహన చోదకులు, పాదాచారులు ఎలాంటి నియమాలు పాటించాలో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.
రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల కోసం సిద్ధం చేసిన గదిని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సతీమణి
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల కోసం సిద్ధం చేసిన గదిని జిల్లా ఎస్పీ దంపతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న తరగతి గదులతో పాటు అదనంగా పునరుద్ధరించిన ఈ గదిని చిన్నారుల కోసం వినియోగించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఇలియాజ్ బాషా ( ఏ.ఆర్ ), సి.ఐ లు ధరణీ కిశోర్, క్రాంతికుమార్, దేవానంద్, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, మధు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, లక్ష్మినారాయణ, సరోజ, రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లలు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

0

ప్రాణదాత సేవా సమితి కి భారత సేవా రత్న అవార్డు లభించింది.

నవంబర్ 14 :రాయచోటి.

అన్నమయ్య జిల్లా. రాయచోటి లోని మదనపల్లి రోడ్డు లో ఉన్న PCR ఫంక్షన్ హాల్ జరిగిన జాతీయ అవార్డుల్లో భాగంగా ప్రాణదాత సేవా సమితి గుంతకల్లు వారు చేస్తున్న సేవలను గుర్తించి భారత సేవా రత్నా పురస్కారని సోమల రాజు ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమరాజు ఫౌండేషన్ శివరాజు మాట్లాడుతూ ప్రాణదాత సేవా సమితి రక్తదాన సేవా కార్యక్రమాలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఇబ్బంది పడే వారికి సరైన సమయానికి బ్లడ్ అరెంజ్ చేయడం. మూగజీవాలకు పండ్లు ఇవ్వడం. రక్తదానంపై అవగాహన అనేక సేవా కార్యక్రమం చేస్తున్నందుకు భారత సేవా రత్న అవార్డు ఇవ్వడం జరిగింది అన్నారు.

ఈ అవార్డు మా ప్రాణదాత సేవా సమితి రక్తదాతలకు అంకితం.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి APWJU రాష్ట్ర అధ్యక్షులు…

0

నవంబర్ 14: అనంతపురం

వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి..

మీడియా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్…

రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు ఇళ్లపట్టాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోవు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జర్నలిస్టులందరూ సహకరించాలని మచ్చా రామలింగారెడ్డి APWJU రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చారు.
అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పాల్గొని లాంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి రవి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో విజయరాజు, జానీ, షాకీర్, లోకరాజు, సాయినాథ్ రెడ్డి, ఇతర జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఇందుకోసం కొత్త జీవోను విడుదల చేయాలని నిబంధనలు సడలించి యూట్యూబ్ ఛానల్స్ చిన్న పత్రికలు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు.
అన్ని కులాల మాదిరిగానే జర్నలిస్టులను ప్రత్యేకంగా గుర్తించి జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి జర్నలిస్టు కుటుంబాలకు, పిల్లలకు ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు మహిళలకు లోన్ల సౌకర్యం కల్పించాలని కోరారు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జీవో విడుదల చేయాలని అన్నారు.
వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఉచిత విద్యను అన్ని కార్పరేట్ స్కూల్లో అందజేయాలని ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యంగా జర్నలిస్టుల సమస్యల కోసం అందర్నీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని జర్నలిస్టులందరూ సహకరించాలని మచ్చా కోరారు .అనంతపురం జిల్లాలో వచ్చే నెల మొదటి వారంలో సభ్యత్వ నమోదు అనంతరం జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించి నూతనంగా కమిటీని ఏర్పాటు చేస్తామని మచ్చా అన్నారు .
సమావేశ అనంతరం జర్నలిస్టులకు సభ్యత్వం రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రాజు, రమేష్, జి.శ్రీధర్, మొహమ్మద్ రఫీ, త్యాగరాజు, తిరుపతయ్య దినేష్, ఉపేంద్ర, విజయ్, సాయికుమార్, జె.నాగరాజు, జి.రాము పెద్ద ఎత్తున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చిన్న పత్రికలు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా శాఖ

శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే ఆర్ రఘురామకృష్ణంరాజు.

0

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే ఆర్ రఘురామకృష్ణంరాజు.

ఏపీ శాసనసభ మండలిలో చీప్ విప్ లుగా నియామకం

శాసనసభలో విప్‌లుగా 15 మంది నియామకం
అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
శాసనమండలిలో చీఫ్‌ విప్‌గా పంచుమర్తి అనురాధ*
మండలిలో విప్‌లుగా చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, జనసేన నుంచి మండలి విప్‌గా పి.హరిప్రసాద్‌*

జర్నలిస్ట్ జార్జికి కాకాని నివాళి.

0

” జర్నలిస్ట్ జార్జికి కాకాణి నివాళి”

నెల్లూరు జిల్లా:
తేది:12-11-2024

నెల్లూరు నగరంలో సీనియర్ వీడియో జర్నలిస్ట్ జార్జి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలవేసి, నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

అహుడా చైర్మన్ పదవి అనంత జనసేనానికి ఇవ్వడం హర్షనీయం..

0

అనంత జనసేనానికి అహుడ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షనీయం.

గుంతకల్లు జనసేనాని వాసగిరి మణికంఠ
నవంబర్ 12 : గుత్తి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభపరిణామంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుండటం అభినందనీయం. ఈ క్రమంలో నూతనంగా అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడ) చైర్మన్ పదవిని అనంత జనసేనాని టి సి వరుణ్ కు కేటాయించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామంటూ గుంతకల్లు నియోజకవర్గం జనసేనాని వాసగిరి మణికంఠ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుత్తి పట్టణం ఆర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తమ నేతలు జిల్లాలోని ఆయా పార్టీల శ్రేణుల పట్ల తమ వంతు బాధ్యతగా పదవులను ఇవ్వడం వారిలో రాజకీయ చైతన్యం తో కూడిన ప్రజాసేవకు సహకరించాలని పిలుపునివ్వడం హర్షనీయమని ఉద్ఘాటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు గుత్తి బాట సుంకులమ్మ ఆలయం నుండి పట్టణ మీదుగా అనంతపురం నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని కూటమి కుటుంబ సభ్యులందరూ విరివిగా పాల్గొని సదరు కార్యక్రమంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల , పట్టణ అధ్యక్షులు పోతరాజుల వెంకటేశ్వర్లు, పాటిల్ సురేష్ లతోపాటు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ గుత్తి సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, అశ్వ నాగప్ప, అఖండు భాష, ధను, ఓబులేసు, హసన్, రమేష్ గుంతకల్లు శ్రేణులు కసాపురం నందా ,గాజుల రాఘవేంద్ర, సుబ్బయ్య ,అమర్, సుంకర నాగరాజు, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.