Wednesday, July 30, 2025
spot_img
Home Blog Page 10
0


ఆరుగురు జూదరులు అరెస్ట్….

రూ.59, 350 నగదు సీజ్..

నవంబర్ 23 గుంతకల్లు

జిల్లా ఎస్పీ జగదీష్ ఉత్తర్వుల మేరకు గుంతకల్లు డిఎస్పి ఆదేశాలతో పట్టణంలోనీ వన్ టౌన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పేకాట స్థావరాలపై శనివారం సీఐ బి మనోహర్ తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఈ దాడుల నేపథ్యంలో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 59 వేల 350 ల నగదును సీజ్ చేశారు. టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు…. తాము చేపట్టిన దాడుల నేపథ్యంలో పట్టణంలోని ఆంథోనీ స్ట్రీట్, కూరగాయల మార్కెట్ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులును అరెస్టు చేసి వారి వద్దనుండి రూ.59,350 ల నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పేకాట, మట్కా, బెట్టింగ్ తదితర వ్యవహారాల లో పాల్గొన్నచో అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన వ్యవహారాల సమాచారంను ఎవరైనా తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు

శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా ర్యాలీ…

0

శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా ర్యాలీ…

నవంబర్ 23 :గుంతకల్లు టౌన్,

స్థానిక పి అండ్ టి కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల గుంతకల్లు-2 విద్యార్థులచే శ్రీ చైతన్య యాజమాన్యం నిర్వహిస్తున్న స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా సేఫ్ ఇండియా కార్యక్రమం నిర్వహణకు ప్రజలలో రోడ్డు భద్రత- ప్రయాణీకులకు అవగాహన కోసం విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని శ్రీ చైతన్య పాఠశాలల ఏ.జీ.ఎం సుబ్బారెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో నిరంతరము ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు మరియు రోడ్ సేఫ్టీ విధానాలను పాటించకపోవడం ఇందుకు కారణమని తెలియజేశారు. అందరూ తూచా తప్పకుండా నియమాలను పాటించాలని చెప్పారు. స్థానిక పాఠశాల నుండి పి& టి కాలనీ ధర్మవరం గేట్ అక్కడి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇందులో భాగంగా స్థానిక వన్ టౌన్ సి ఐ బి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు నినాదాలతో మరియు చిన్ననాటికతో ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ ర్యాలీలో కోఆర్డినేటర్ నాగభూషణం మాట్లాడుతూ ప్రయాణీకులు ప్రయాణ సమయంలో సరైన ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ మొదలైన రక్షణ పరికరాలను ధరించి ప్రయాణించాలన్నారు. ప్రిన్సిపాల్ పురుషోత్తం మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని వాటిని అనుసరించి అందరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి అని తెలియజేశారు. ఈ ర్యాలీలో పాఠశాల డీన్ జాన్, సి ఇంచార్జ్ ఖాదర్, ప్రైమరీ ఇంచార్జ్ హేమావతి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.

శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా ర్యాలీ..

0

శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా ర్యాలీ..

గుంతకల్లు టౌన్,

స్థానిక పి అండ్ టి కాలనీలో గల శ్రీ చైతన్య పాఠశాల గుంతకల్లు-2 విద్యార్థులచే శ్రీ చైతన్య యాజమాన్యం నిర్వహిస్తున్న స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా సేఫ్ ఇండియా కార్యక్రమం నిర్వహణకు ప్రజలలో రోడ్డు భద్రత- ప్రయాణీకులకు అవగాహన కోసం విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని శ్రీ చైతన్య పాఠశాలల ఏ.జీ.ఎం సుబ్బారెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో నిరంతరము ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు మరియు రోడ్ సేఫ్టీ విధానాలను పాటించకపోవడం ఇందుకు కారణమని తెలియజేశారు. అందరూ తూచా తప్పకుండా నియమాలను పాటించాలని చెప్పారు. స్థానిక పాఠశాల నుండి పి& టి కాలనీ ధర్మవరం గేట్ అక్కడి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇందులో భాగంగా స్థానిక వన్ టౌన్ సి ఐ బి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు నినాదాలతో మరియు చిన్ననాటికతో ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ ర్యాలీలో కోఆర్డినేటర్ నాగభూషణం మాట్లాడుతూ ప్రయాణీకులు ప్రయాణ సమయంలో సరైన ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ మొదలైన రక్షణ పరికరాలను ధరించి ప్రయాణించాలన్నారు. ప్రిన్సిపాల్ పురుషోత్తం మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని వాటిని అనుసరించి అందరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి అని తెలియజేశారు. ఈ ర్యాలీలో పాఠశాల డీన్ జాన్, సి ఇంచార్జ్ ఖాదర్, ప్రైమరీ ఇంచార్జ్ హేమావతి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు…

0

తిరుమల..

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు..

తిరుపతి అడిషనల్ ఎస్పీతో నలుగురు డీఎస్పీల భేటీ
నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ..

తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో సిట్ ఆఫీస్ ఏర్పాటు
ఎల్లుండి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు..

ఏఆర్ డైరీ ఫుడ్స్ పరిశీలించనున్న సిట్ టీమ్
TTD తీర్మానాలు, నెయ్యి కొనుగోళ్లలో అధికారులపాత్ర..

లడ్డు తయారీకి వినియోగించే ముడి సరుకులు..

పోటును పరిశీలించనున్న సిట్ బృందం..

విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి..

0

విషాదం.. తలలోకి తూట దూసుకెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ మృతి..

నవంబర్ 22 :గుంటూరు

గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్‌ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది.. వంశీకృష్ణ అనే హెడ్‌ కానిస్టేబుల్‌.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. వెంటనే తోటి కానిస్టేబుళ్లు వంశీకృష్ణను జీజీహెచ్‌​కు తరలించారు. అయితే ఈలోపే అతను మృతి చెందారని వైద్యులు తెలిపారు. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా.. లేక వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. హెడ్‌ కానిస్టేబుల్‌ వంశీకృష్ణ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది..

ఉర్దూ హాస్టల్ ను ప్రారంభించండి…- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి

0

ఉర్దూ హాస్టల్ ను ప్రారంభించండి….
— కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి

నవంబర్ 22 : గుంతకల్లు

ఉర్దూ హాస్టల్ ను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముసలి రెడ్డి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పాత బస్టాండ్ నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి మాట్లాడుతూ…గుంతకల్లు పట్టణంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉర్దూ మీడియం హాస్టల్ పట్టణంలో టిడిపి ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది. అయితే ఈరోజు వరకు హాస్టల్ సిబ్బంది కొరకు సుమారు తొమ్మిది సంవత్సరముల నుండి నియమించలేదు ఈ మైనార్టీ కాలేజ్ స్థలంను కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి పాల్పడుతున్నారని అన్నారు. అదే స్థలంలో మైనార్టీ ట్రస్ట్ కొనడం జరిగినది ఈ కాలేజీ ఆవరణంలో పిచ్చి మొక్కలు పెరిగి మద్యం పానం సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయని అన్నారు. దయచేసి అధికారులు ఈ ఉర్దూ కాలేజీకి మైనార్టీ విద్య అభివృద్ధి కి సిబ్బంది కొరకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించి ఉర్దూ కాలేజీ ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. లేనిచో ఈ ఉద్యమ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ ,గురుఫరోష్ జిలాన్, ఖాదర్ వలీ ,తాహెర్, రామ్ రెడ్డి, మోహన్, కుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 23,24 తేదీలలో ఓటరుగా నమోదు, తొలగింపులకు సువర్ణవకాశం…తహసిల్దార్ రమాదేవి.

0

ఈనెల 23,24 తేదీలలో ఓటరుగా నమోదు, తొలగింపులకు సువర్ణవకాశం…
తహసిల్దార్ రమాదేవి

నవంబర్ 22 గుంతకల్లు

గుంతకల్లు నియోజకవర్గం లో ఈనెల 23,24 వ తేదీలలో ఆయా పోలింగ్ కేంద్రాలలో బూతు స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఓటరుగా నమోదుతో పాటు తొలగింపు చర్యలకు సువర్ణ అవకాశం జిల్లా అధికారయంత్రాంగం కల్పించిందని గుంతకల్లు మండల తహసిల్దార్ రమాదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు ప్రజలు నూతనంగా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకొనుటకు ఓటరుగా నమోదు అవకాశం తో పాటు తొలగించుకుని అవకాశం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని గుంతకల్లు నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

శాస్త్రోక్తంగా దురస్తంభం ప్రతిష్ట మహోత్సవం…

0

శాస్త్రోక్తంగా దురస్తంభం ప్రతిష్ట మహోత్సవం…
నవంబర్ 21: కూడేరు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పరిధిలోని కలగల్లు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ధవస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. గ్రామంలో నిర్మితమైన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో గ్రామ ప్రజల సహకారంతో శ్రీ అయ్యప్ప స్వాములు, శివ స్వామి ల మాలదారులు సమిష్టిగా ఆయా గురుస్వాములు డ్యామ్ వెంకటేష్, కలగల్లు గురుస్వామి ,తిరుస్వామి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలగళ్ల ఈడిగ రామాంజనేయులు లతోపాటు పలువురు గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన  పథకం రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా ప్రధమ స్థానంలో ఉండేందుకు అధికారులు కృషి చేయాలి..

0

ప్రధానమంత్రి ఆవాస్ యోజన  పథకం రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా ప్రధమ స్థానంలో ఉండేందుకు అధికారులు కృషి చేయాలి..

నవంబర్ 20 గుత్తి.

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఐఏఎస్

రాష్ట్రంలో అనంతపురం జిల్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన  పథకం లో మొదటి స్థానంలో ఉండేందుకు   అధికారులకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, ఐఏఎస్ పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన  పథకం లబ్ధిదారుల అవగాహన వారోత్సవాలలో  భాగంగా   బుధవారం   గుంతకల్  నియోజకవర్గం గుత్తి మండలంలోని   జక్కల చెరువు గ్రామంలో  జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం మండలంలోని ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుందని   కానీ దీనివల్ల  గ్రామస్థాయిలోని  ప్రజలకి దాని పట్ల అవగాహన ఉందా లేదా అని ఒక ప్రశ్నగా మారిందని దీనిని దృష్టిలో ఉంచుకొని  ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకాన్ని  చిట్టచివరి   గ్రామానికి, లబ్ధిదారునికి అవగాహన కలుగుతుందో అప్పుడు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.  వివిధ కార్యక్రమాలను జిల్లా కేంద్రంలోనే కాకుండా   మారుమూల గ్రామాలలో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు .అలా నిర్వహించే గ్రామ సభలలో అధికారులు ప్రజాప్రతినిధులు  వెళ్లి కూర్చొని మాట్లాడి   నేరుగా సమాచారాన్ని తెలియజేయడం వలన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఫలితాలను సాధించాలన్నారు.కేంద్ర ఆవాస్  దివాస్  యోజన  పథకం ముఖ్య  ఉద్దేశం  పేదలకు ఇల్లు  కట్టించి ఇవ్వాలని యోచనతో  కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా  జిల్లాలకు అందజేస్తుందని తెలిపారు. దీనిలో ఒక ఇంటికి ఒక లక్ష 20 వేల రూపాయలు ప్రభుత్వం నుండి  అందుతుందని  అన్నారు. ఇందులో కొంతమందికి ఇంటి స్థలము ఉండి     పక్కా గృహాలు లేనివారికి రెవెన్యూ శాఖ వారి ద్వారా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఇల్లు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని,  ఇంకొకటి భూమిలేని వారికి ఇల్లు కావాలని అర్జీ దారుడు వస్తే అలాంటివారికి రెవెన్యూ శాఖ వారి ద్వారా  భూమిని గుర్తించి లేఔట్లను తయారు చేసి  ఇళ్లను కట్టించి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుండి 1.20 లక్షల రూపాయలు ఇస్తుందని దీనికి మీరు కొంత వేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చని అలా కూడా కాకుండా మొత్తం కూడా మీ వద్ద లేని పక్షంలో పొదుపు సంఘాల ద్వారా 30 వేల రూపాయలు పొదుపు సంఘాల లోని మహిళలకు  అప్పుగా రొటేషన్ పద్ధతిలో  ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఇలా లక్ష యాభై వేల లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవచ్చని అన్నారు.  సమాజంలో ఒక ఇల్లు నిర్మించుకుంటే గౌరవం,ఆడపిల్లలకు భద్రత, ఆర్థిక భద్రత  ఉంటుంది అన్నారు. ప్రభుత్వం ద్వారా నిర్మించే గృహ నిర్మాణాల సముదాయాల సంబంధించి మౌలిక వసతులు కల్పనకు  ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు కాలువలు,ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మరింత ముందుకు తీసుకెళ్లే    అవగాహన మరియు  సద్వినియోగం కల్పించే దిశగా కృషి చేయాలని హౌసింగ్ పిడిని  ఆదేశించారు.  అనుమతులు ఇచ్చి ఇంకను పనులు ప్రారంభించని  వారిని సంప్రదించి వారికి అవసరం ఉందో లేదో తెలుసుకుని మరొకరికి అవకాశం కల్పించే విధంగా  చూసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని  కోరారు.ఈ పథకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని   జిల్లాలో ఏ నిరుపేద కూడా  ఇల్లు కావాలని వచ్చేవారికి  ఇల్లు కట్టించి లబ్ధి పొందే విధంగా చూడాలని ఆర్డీవో,  హౌసింగ్, ఉపాధి హామీఅధికారులకు ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ పనులను త్వరితగతిన పూర్తి చేసి బిల్లులను లబ్ధిదారుల  అంతే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జక్కల చెరువు గ్రామంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని ఇళ్లలో   నివసిస్తున్న  బొలికొండ, సురేష్ బాబు,  వీరారెడ్డి ఇళ్లను పరిశీలించి వారితో ఇంతకుముందు  ఇలాంటి ఇండ్లలో ఉండేవాడిని, ఏ విధంగా ఉండేవారని , ఇండ్ల నిర్మాణం గురించి ఎవరు తెలియజేశారని, ఇల్లు నిర్మాణంలో  ఏవైనా  ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల నుండి వచ్చాయా,సిమెంటు, ఇసుక తదితర  విషయాలను అడిగారు.  గతంలో మట్టి ఇండ్లలో,  గుడిసెలలో ఉండేవారమని  ప్రభుత్వ  గృహ నిర్మాణ  అధికారులు    ఈ పథకం గురించి తెలియజేశారని  తద్వారా  ఇల్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ  శైలజ  ,జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, తాసిల్దార్ ఓబులేసు, ఎంపీడీవో ప్రభాకర్ , హౌసింగ్ ఈ మధుసూదన్ రెడ్డి,హౌసింగ్ ఏఈ సూర్యనారాయణ,ఎంపీపీ విశాలాక్షి, ఎంపీటీసీ  నారాయణస్వామి,   ప్రజా ప్రతినిధులు  నారాయణ,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.15000 నగదు జరిమానా…

0

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.15 వేలు జరిమానా…
నవంబర్ 20 గుంతకల్లు
అనంతపూర్ జిల్లా గుంతకల్లు పట్టణంలోని అరవింద్ నగర్ ప్రాంతంలో 01/04/ 2022 న ఓ భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన గురించి అనంతపురం జిల్లా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శోభారాణి తన తీర్పులో భాగంగా ముద్దాయికి జీవిత ఖైదీగా , 15వేల రూపాయల నగదును జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం జరిగిందని గుంతకల్లు వన్ టౌన్ సిఐ మనోహర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గత 01/04/2022 తేదీన పట్టణంలోని అరవింద్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం నాయక్ అనే వ్యక్తి తన భార్య కదిరి మండలం రాజువారి పల్లి తాండ గ్రామానికి చెందిన మూడే చంద్ర నాయక్ కుమార్తె ఎం అఖిలను (20) ను అతికిరాతకంగా హత్య చేసినట్లు న్యాయస్థానంలో 11 మంది సాక్షుల విచారంలో నేరం రుజువైందన్నారు. అందుకు తీర్పుగా న్యాయ మూర్తి ముద్దాయి అయినా సుబ్రహ్మణ్యం నాయక్ కు జీవితం ఖైదీ విధిస్తూ 15000 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారన్నారు. నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ పోలీస్ శాఖ సిబ్బంది సాక్షులను న్యాయస్థానం ముందు హాజరు పరిచి నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారని ఆయన అన్నారు.